Showing posts with label yesudas. Show all posts
Showing posts with label yesudas. Show all posts

Monday, December 16, 2013

ఏ సీమల ఏమైతివో ఏకాకిని నా ప్రియా....

ఏ సీమల ఏమైతివో 
ఏకాకిని నా ప్రియా... 
ఏకాకిని నా ప్రియా...
ఏలాగీ వియోగాన వేగేనో నా ప్రియా...
ఏలాగీ మేఘమాసమేగేనో 
ప్రియా.. 
ప్రియా.. ప్రియా..  ప్రియా...
ఘడియ ఘడియ ఒక శిలయై కదలదు సుమ్మీ..
ఎద లోపల నీ రూపము చెదరదు సుమ్మీ..
పడి రావాలంటే వీలు పడదు సుమ్మీ.. 

వీలు పడదు సుమ్మీ.. 

విరాహ బాధ ని ఇంత కన్నా ఎవరు బాగా చెప్పగలరు. 
మేఘసందేశం చిత్రంలోని ఈ పద్యాలను జేసుదాసు గారి గొంతుతో వింటూ ఉంటే ఏదో తెలియని లోకానికి వెళ్ళినట్లు ఉంది . ప్రతి కవిత లో కవి తన భావన ని, బాధని ఎంతో బాగా చెప్పాడు అంతే వీనుల విందుగా జేసుదాసు గారు వినిపించారు . ఇవే కాకుండా కవితలు చాలా ఉన్నాయి ఈ చిత్రము లో. ప్రతి రోజూ ఎన్నిసార్లు వింటున్నానో తెలియకుండా వింటున్నాను ఈ కవితలని . 


ఈ కవితలని యేసుదాసు గారి గళము లో ఈ క్రింది లంకె ద్వారా వినవచ్చు. 



ఉదయగిరి పయిన  
అదిగొ గగనాన 
కదలె దినరాజు తేరు
ఒదిగి చిరుగాలి 
నిదుర తెర జారి 
కదలె గోదారి నీరు
కదలె గోదారి నీరు

ఊపి ఊపి మనసునొక్కొక్క వేదన 
కావ్యమౌను మరియు గానమౌను
నేటి బాధ నన్ను మాటాడగానీని
 ప్రళయమట్లు వచ్చి పడియె పైని

దారులన్నియు మూసె 
దశ దిశలు ముంచెత్తే 
నీ రంధ్ర భయధాంథకార జీమూతాళి
ప్రేయసీ
ప్రేయసీ
వెడలిపోయితివేల 
ఆ అగమ్య తమస్వినీ గర్భకుహరాల
తమస్వినీ గర్భకుహరాల

లోకమంతా పాకినవి పగటి వెలుగులు
నాకు మాత్రం రాకాసి చీకట్ల మూలుగులు
రాకాసి చీకట్ల మూలుగులు


ఎపుడు నీ పిలుపు వినబడదో 
అపుడు నా అడుగు పడదు 
ఎచటికో పైనమెరుగక 
ఎందుకో వైనమందక 
నా అడుగు పడదు

అది 
ఒకానొక మలు సందె 
ఎదుట
గౌతమీ నది 
ఇరు దరులొరసి 
మింటి చాయలను 
నెమరు వేసుకొనుచు 
సాగినది
అపుడు
అపుడే
కలిగె నాకొక్క దివ్యానుభూతి
కలిగె నాకొక్క దివ్యానుభూతి

శూన్యాకాశము వలె 
చైతన్యలవము లేని 
బ్రతుకు దారుల 
శోభానన్యంబు 
ఒక శంపాలత 
కన్యక 
తొలివలపు వోలె
కాంతులు నించెన్

అంతరాంతరమున
వింత కాంతి నిండి
ఊహలకు రెక్కలొచ్చి
ప్రత్యూష పవన లాలనమునకు విచ్చు సుమాల వోలె.. 
అలతి కవితలు వెలువడే
అంతలోన.....
కనుమొరగిచనెమెరపు 
చీకటులు మిగిలె
అపుడు ఎలుగెత్తి పిలిచినాను
అపుడు దారి తెలియక వెలుగు కొరకు రోదించినాను
రోదించినాను
వెదకి వెదకి వేసారితి 
వెర్రినైతి


ఆశలు రాలి 
ధూళి పడినప్పుడు
గుండెలు చీల్చు వేదనావేశము 
వ్రేల్చినప్పుడు
వివేకము గోల్పడి సల్పినట్టి 
ఆక్రోశము 
రక్తబిందువులలో 
రచియించితి నేను
మేఘసందేశము 
రూపు దాల్చెనది నేడు.
ఇది ఏమి మహా కవిత్వమో!

శోకమొకటియె కాదు 
సుశ్లోకమైన కావ్యమునకు జీవము పోయ
కరుణ ఒకటియే కాదు రసము 
జీవితమున
కవికి వలయు 
ఎన్నో వివిధానుభూతులు 
ఎడద నిండా

నా అన్వేషణ ఎన్నడేన్ సఫలమై
నా మన్కియే 

పూవులున్ 
కాయల్ 
పండ్లును 
నిండు నందనముగా నైనన్
వ్యథావేదనల్ మాయంబై 

సుఖశాంత జీవనము 
సంప్రాప్తించి పూర్ణుండనై
వ్రాయంజాలుదు మానవానుభవదీవ్యత్కావ్య 

సందోహమున్ !!

అంతే  కాకుండా ఈ సినిమా లోని ప్రతి పాట ఒక అద్భుతం అజరామరం . కృష్ణ శాస్త్రి గారి భావ కవిత్వము అమోఘం .